Building Collapse: కుప్పకూలిన భవనం.. సజీవ సమాధైన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Building Collapse Kills Five In Amravati City: మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఓ భవనం కుప్పకూలి, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అమరావతిలోని ప్రభాత్ టాకీస్ ప్రాంతంలో ఈ దుర్ఘటన మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లోని షాపు యజమాని నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం సంభవించిందని, అతనిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. మొదటి, రెండవ అంతస్తులను రాజేంద్ర లాడ్జ్గా మార్చగా.. గ్రౌండ్ ఫ్లోర్లో ఐదు దుకాణాలు ఉన్నాయి. శిథిలాలను తొలగించే సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పోలసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ఓ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. ఆ భవనం శిథిలావస్థకు చేరుకుందని మున్సిపాలిటీ ఇదివరకే డిక్లేర్ చేసిందని, 2020లోనే నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. కొన్ని నెలల క్రితం మొదటి, రెండవ అంతస్తుల్ని ఖాళీ చేయించి, కూల్చేశారన్నారు. కొన్ని భాగాల్ని మాత్రం అలాగే ఉంచేశారన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లోని రెండు షాపుల్ని బ్యాగ్ తయారీ దుకాణంగా మార్చారని, భవనం కూలిపోతున్న సమయంలో ఐదుగురు వ్యక్తులు అక్కడే ఉన్నారని చెప్పారు. ఇతర షాపులు మాత్రం ఖాళీగా ఉన్నాయన్నారు. భవనం శిథిలావస్థకు చేరుకుందన్న విషయం తెలిసి కూడా షాపు యజమాని ఐదుగురి వ్యక్తుల్ని పనిలో పెట్టుకున్నాడని.. అతని నిర్లక్ష్యం వల్లే ఆ ఐదుగురు మృతి చెందడంతో ఐసీపీ సెక్షన్ 304ఏ కింద అతనిపై కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
- Jaipur Tension Over School Row: జైపూర్లో ఉద్రిక్తత.. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై గ్రామస్థుల దాడి
- Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ
- Ram Mandir Prasad: "రామ మందిర ప్రసాద్ " అంటూ అమ్మకాలు.. అమెజాన్కు రూ. 1 లక్ష జరిమానా.!
ఇక అమరావతి ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్ శివ ఆడె మాట్లాడుతూ.. “అగ్నిమాపక దళానికి చెందిన 25 మందికి పైగా సిబ్బందితో పాటు కలెక్టర్ కార్యాలయానికి చెందిన విపత్తు బృందం సహాయక చర్యల్లో నిమగ్నమైంది. భవనం కూలిన వెంటనే స్థానికులు ఒక వ్యక్తితో పాటు మరో మహిళను రక్షించారు. మేము జేసీబీ యంత్రాన్ని ఉపయోగించి శిథిలాల్ని తొలగించాం. ఐదుగురు వ్యక్తులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా.. వాళ్లు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు’’ అని చెప్పారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని డివిజనల్ కమిషనర్ను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మహారాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ప్రకటించారు.
తాజావార్తలు
-
Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!
-
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
-
Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!