NTV Telugu Site icon

Kavitha: కవిత బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి ఢిల్లీ కోర్టు నోటీసు

Kavitha

Kavitha

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి రోస్ అవెన్యూ కోర్టు సోమవారం నోటీసు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం ఆమె అభ్యర్థించారు. దీంతో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సీబీఐకి సమన్లు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను న్యాయస్థానం జూలై 12కి వాయిదా వేసింది.

ఇది కూడా చదవండి: Delhi: దారుణం.. యువకుడి పై నుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్, మృతి

లిక్కర్ పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఢిల్లీ తీహార్ జైల్లో ఉంటున్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా దర్యాప్తు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని అభ్యంతరం తెలిపాయి. దీంతో అనేక మార్లు బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యారు. తాజాగా డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను కవిత దాఖలు చేవారు. జూలై 12న ధర్మాసనం తీర్పు ఇవ్వనుంది.

ఇది కూడా చదవండి: Siddharth: అప్పుడు కండోమ్ తో రోడ్డెక్కింది నేనే.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్