జార్ఖండ్లో బీజేపీ దూకుడుగా ఉంది. శుక్రవారం పొత్తులు ఖరారు చేసుకుంది. గంటల వ్యవధిలోనే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేసేసింది. శనివారం సాయంత్రం 66 మందితో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింంది. ధన్వర్ నుంచి బీజేపీ పార్టీ రాష్ట్ర చీఫ్ బాబులాల్ మరాండీ, బోరియో నుంచి లోబిన్ హెంబ్రోమ్, జమ్తారా నుంచి సీతా సోరెన్, సరైకెల్లా నుంచి మాజీ సీఎం చంపై సోరెన్, చైబాసా నుంచి గీతా బల్ముచు, జగన్నాథ్పూర్ నుంచి గీతా కోడా, పొట్కా నుంచి మీరా ముండా పోటీ చేయనున్నారు.