Bengal: రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్లో అల్లర్లు
- రాష్ట్ర వ్యాప్తంగా అల్లరి మూకలు విధ్వంసం
- అల్లర్లపై బీజేపీ కీలక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం వెలువడిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 294 స్థానాలకు గాను 207 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద శక్తిగా నిలిచింది. అయితే ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి. టీఎంసీ కార్యాలయాలు, ఇళ్లు ధ్వంసం అవుతున్నాయి. రోడ్లపై కొన్ని గుంపులు రణరంగం సృష్టిస్తున్నాయి. అయితే బీజేపీనే ఈ దాడులకు ఉసిగొల్పుతోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ కీలక ప్రకటన విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ‘గుండా వాహిని’ పేరుతో కొంతమంది వ్యక్తులు బీజేపీ కార్యకర్తలుగా నటిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. ‘‘అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇది నిస్సందేహంగా తెలియజేస్తున్నాము. ఇటువంటి మోసాన్ని బీజేపీ సహించదు.’’ అని ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Also Read
- NEET UG Result 2026: నీట్ యూజీ ఫలితాలు వచ్చేశాయ్.. స్కోర్కార్డ్ను ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
ఇలాంటి మోసపూరిత చర్యలను ఏ మాత్రం సహించబోమని తెలిపింది. బీజేపీ పేరుతో వేషధారణ చేసి, భయభ్రాంతులకు గురిచేయడం, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం వంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నేర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై చట్టం తన సంపూర్ణ శక్తితో పనిచేస్తుందని బీజేపీ పేర్కొంది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం చట్టపాలనను పునరుద్ధరించేందుకు, బాధ్యతను నిర్ధారించేందుకు, ప్రతి పౌరుడిని భయభ్రాంతులు లేకుండా రక్షించేందుకు కట్టుబడి ఉందని వెల్లడించింది.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 207 స్థానాల్లో గెలిచింది. టీఎంసీ 80 సీట్లలో విజయం సాధించింది. అయితే ఓటమి తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మమతా బెనర్జీ నిరాకరించారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం మే 7తో ముగియనుంది. అనంతరం గవర్నర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించే అవకాశం ఉంది.
West Bengal BJP issues a statement – "It has come to our notice that elements of the Trinamool's so-called "Gunda Vahini" are attempting to impersonate BJP workers to mislead people and create disorder. Let it be stated unequivocally: the BJP will not tolerate such deception.… pic.twitter.com/Wic9GnhM9C
— ANI (@ANI) May 6, 2026
తాజావార్తలు
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
-
Samantha : ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సమంత ఇండస్ట్రీ హిట్ MIB
-
Rohit Sharma Retirement: లార్డ్స్లో ఫేర్వెల్ మ్యాచ్..? ఇంటర్నేషనల్ క్రికెట్కు వీడ్కోలు పలకనున్నాడా..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!