Site icon NTV Telugu

Ambedkar Jayanti: పార్లమెంట్ దగ్గర అంబేద్కర్‌ చిత్రపటానికి మోడీ, ఖర్గే నివాళి

Pmmodi1

Pmmodi1

డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఉన్న విగ్రహానికి ప్రధాని మోడీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాక‌ృష్ణన్, కేంద్రమంత్రులు, అధికారులు నివాళులర్పించారు.

ఖర్గే-మోడీ సంభాషణ
మరోసారి పార్లమెంట్ వేదికగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మోడీ-రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మధ్య సరదా సంభాషణ జరిగింది. దీంతో మోడీ-ఖర్గే మనసారా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల జ్యోతిరావ్ ఫులే జయంతి సందర్భంగా మోడీ-రాహుల్ గాంధీ మధ్య కూడా చాలా సేపు సంభాషణ జరిగింది. తల్లి సోనియాగాంధీ ఆరోగ్య విషయాలను మోడీ అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హైలెట్‌గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈనెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు.

 

Exit mobile version