Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..
- భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తదే..
- భర్త చనిపోయాని ఆయన బాధ్యత ముగిసిపోదు..
- అత్తమామల నుంచి వితంతు స్త్రీ భరణం పొందేందుకు అర్హురాలే..
- అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad High Court: భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్తదే అని, అతను చనిపోయినా బాధ్యత ముగిసిపోదని అలహాబాద్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఒక వితంతువు తన మరణించిన భర్త ఆస్తి నుంచి భరణం పొందవచ్చని, ఒక వేళ అది సరిపోకపోతే తన మామగారి నుంచి పొందొచ్చని కోర్టు పేర్కొంది. అకుల్ రస్తోగి అనే వ్యక్తి తన భార్య తప్పుడు సాక్ష్యం చెబుతోందంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ అరిందమ్ సిన్హా, జస్టిస్ సత్య వీర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్కు కారణం ఇదే..
Also Read
భర్త తరుపున వాదించిన న్యాయవాది.. భార్య తన ఆర్థిక స్థితిని దాచిపెట్టి భరణం కోరిందని ఆరోపించారు. ఆమె తనను తాను గృహిణిగా చూపించుకుని, తన వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని తెలిపారు. అయితే, విచారణలో ఈ డిపాజిట్లు మహిళ తండ్రి ద్వారా వచ్చినవని, ప్రస్తుతం దాంట్లో ఎక్కువ భాగం విత్ డ్రా అయినట్లు తెలిసింది. దీంతో ఆమెకు ఆర్థిక సహాయం అవసరమని కోర్టు భావించింది.
ఈ కేసును విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలు అందించడంలో భర్త తరుపు లాయర్ విఫలమైనట్లు న్యాయమూర్తులు భావించారు. భర్త మరణించిన తర్వాత ఆస్తి సరిపోకపోతే వితంతు మహిళ అత్తమామల నుంచి కూడా భరణం కోరేందుకు హక్కు ఉంటుందని చెప్పింది. అయితే కొన్ని చట్టపరమైన పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. భర్త తన భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. భార్యకు భరణం అందించడం భర్త విధి అని కోర్టు పేర్కొంది. భర్త మరణంతో అతడి విధి ముగిసిపోదని, కొన్ని షరతులకు లోబడి అత్తింటి వారి నుంచి భరణం కోరే హక్కు వితంతు స్త్రీకి ఉంటుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Bank Holidays: ఈ వారం బ్యాంకుల సెలవుల లిస్ట్ ఇదే.. ఓ లుక్కేయండి!
-
CM Chandrababu : భారత్ పారిశ్రామిక వృద్ధిలో సీఐఐ పాత్ర కీలకం
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?