Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..
- భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తదే..
- భర్త చనిపోయాని ఆయన బాధ్యత ముగిసిపోదు..
- అత్తమామల నుంచి వితంతు స్త్రీ భరణం పొందేందుకు అర్హురాలే..
- అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allahabad High Court: భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్తదే అని, అతను చనిపోయినా బాధ్యత ముగిసిపోదని అలహాబాద్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఒక వితంతువు తన మరణించిన భర్త ఆస్తి నుంచి భరణం పొందవచ్చని, ఒక వేళ అది సరిపోకపోతే తన మామగారి నుంచి పొందొచ్చని కోర్టు పేర్కొంది. అకుల్ రస్తోగి అనే వ్యక్తి తన భార్య తప్పుడు సాక్ష్యం చెబుతోందంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ అరిందమ్ సిన్హా, జస్టిస్ సత్య వీర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్కు కారణం ఇదే..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
భర్త తరుపున వాదించిన న్యాయవాది.. భార్య తన ఆర్థిక స్థితిని దాచిపెట్టి భరణం కోరిందని ఆరోపించారు. ఆమె తనను తాను గృహిణిగా చూపించుకుని, తన వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని తెలిపారు. అయితే, విచారణలో ఈ డిపాజిట్లు మహిళ తండ్రి ద్వారా వచ్చినవని, ప్రస్తుతం దాంట్లో ఎక్కువ భాగం విత్ డ్రా అయినట్లు తెలిసింది. దీంతో ఆమెకు ఆర్థిక సహాయం అవసరమని కోర్టు భావించింది.
ఈ కేసును విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలు అందించడంలో భర్త తరుపు లాయర్ విఫలమైనట్లు న్యాయమూర్తులు భావించారు. భర్త మరణించిన తర్వాత ఆస్తి సరిపోకపోతే వితంతు మహిళ అత్తమామల నుంచి కూడా భరణం కోరేందుకు హక్కు ఉంటుందని చెప్పింది. అయితే కొన్ని చట్టపరమైన పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. భర్త తన భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. భార్యకు భరణం అందించడం భర్త విధి అని కోర్టు పేర్కొంది. భర్త మరణంతో అతడి విధి ముగిసిపోదని, కొన్ని షరతులకు లోబడి అత్తింటి వారి నుంచి భరణం కోరే హక్కు వితంతు స్త్రీకి ఉంటుందని పేర్కొంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?