Allahabad High Court: భర్త చనిపోయినా భార్యను పోషించాల్సిందే.. ‘‘భరణం’’పై కీలక తీర్పు..
- భార్యను పోషించాల్సిన బాధ్యత భర్తదే..
- భర్త చనిపోయాని ఆయన బాధ్యత ముగిసిపోదు..
- అత్తమామల నుంచి వితంతు స్త్రీ భరణం పొందేందుకు అర్హురాలే..
- అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు..
Allahabad High Court: భార్యను పోషించాల్సిన చట్టపరమైన బాధ్యత భర్తదే అని, అతను చనిపోయినా బాధ్యత ముగిసిపోదని అలహాబాద్ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు చెప్పింది. ఒక వితంతువు తన మరణించిన భర్త ఆస్తి నుంచి భరణం పొందవచ్చని, ఒక వేళ అది సరిపోకపోతే తన మామగారి నుంచి పొందొచ్చని కోర్టు పేర్కొంది. అకుల్ రస్తోగి అనే వ్యక్తి తన భార్య తప్పుడు సాక్ష్యం చెబుతోందంటూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ అరిందమ్ సిన్హా, జస్టిస్ సత్య వీర్ సింగ్లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
Read Also: Stock Market: హమ్మయ్య.. ఎట్టకేలకు భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. బుల్లిష్కు కారణం ఇదే..
Also Read
- Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
- Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
- PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
భర్త తరుపున వాదించిన న్యాయవాది.. భార్య తన ఆర్థిక స్థితిని దాచిపెట్టి భరణం కోరిందని ఆరోపించారు. ఆమె తనను తాను గృహిణిగా చూపించుకుని, తన వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ల వివరాలను పూర్తిగా వెల్లడించలేదని తెలిపారు. అయితే, విచారణలో ఈ డిపాజిట్లు మహిళ తండ్రి ద్వారా వచ్చినవని, ప్రస్తుతం దాంట్లో ఎక్కువ భాగం విత్ డ్రా అయినట్లు తెలిసింది. దీంతో ఆమెకు ఆర్థిక సహాయం అవసరమని కోర్టు భావించింది.
ఈ కేసును విచారించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. ఆరోపణలకు మద్దతుగా సాక్ష్యాలు అందించడంలో భర్త తరుపు లాయర్ విఫలమైనట్లు న్యాయమూర్తులు భావించారు. భర్త మరణించిన తర్వాత ఆస్తి సరిపోకపోతే వితంతు మహిళ అత్తమామల నుంచి కూడా భరణం కోరేందుకు హక్కు ఉంటుందని చెప్పింది. అయితే కొన్ని చట్టపరమైన పరిస్థితులపై ఇది ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. భర్త తన భార్యకు భరణం చెల్లించాలని ఆదేశించింది. భార్యకు భరణం అందించడం భర్త విధి అని కోర్టు పేర్కొంది. భర్త మరణంతో అతడి విధి ముగిసిపోదని, కొన్ని షరతులకు లోబడి అత్తింటి వారి నుంచి భరణం కోరే హక్కు వితంతు స్త్రీకి ఉంటుందని పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?