ఎయిర్ స్టాఫ్ చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత భారత వైమానిక దళానికి చీఫ్గా అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమర్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి నియామకం అమలులోకి వస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇది కూడా చదవండి: Kilari Rosaiah: వైసీపీకి మరో షాక్.. డిప్యూటీ సీఎం పవన్తో మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య భేటీ..
ఎయిర్ మార్షల్లో చక్కటి వ్యూహకర్తగా అమర్ పేరుగాంచారు. అక్టోబర్ 27, 1964న అమర్ సింగ్ జన్మించారు. డిసెంబర్ 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్ స్ట్రీమ్లోకి ప్రవేశించారు. దాదాపు 40 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, విశిష్టమైన సేవలో.. వివిధ కమాండ్, స్టాఫ్, ఇన్స్ట్రక్షన్ మరియు విదేశీ నియామకాలలో పనిచేశారు.
ఇది కూడా చదవండి: Crime: పిల్లలు లేరనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య.. వారి వయసు 28 ఏళ్లే
టెస్ట్ పైలట్గా మాస్కోలో MiG-29 అప్గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ బృందానికి నాయకత్వం కూడా వహించాడు. నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (విమాన పరీక్ష) మరియు తేలికపాటి యుద్ధ విమానం తేజస్ యొక్క ఫ్లైట్ టెస్టింగ్కు బాధ్యత వహించాడు. సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్ మరియు ఈస్టర్న్ ఎయిర్ కమాండ్లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్గా ముఖ్యమైన సిబ్బంది నియామకాలను నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. సెంట్రల్ ఎయిర్ కమాండ్కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా ఉన్నారు. ఇటీవల బహుళజాతి యుద్ధ గేమ్ ‘‘తరంగ్ శక్తి’’ని IAF హోస్ట్ చేయడంలో ఎయిర్ యోధుడు కీలక పాత్ర పోషించాడు. అమర్కు పరమ విశిష్ట సేవా పతకం మరియు అతి విశిష్ట సేవా పతకాలు దక్కాయి.
ఇది కూడా చదవండి: Atishi Marlena: కార్యకర్త నుంచి సీఎం పదవి వరకు… ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ‘అతిషి’ ప్రస్థానం..