ఉత్తరాఖండ్లో దారుణఘటన చోటు చేసుకుంది. లోయలో బస్సు పడిపోవడంతో 13 మంది మృతి చెందారు. అంతేకాకుండా చాలా మందికి తీవ్ర గాయాలవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని చక్రటలో గల బులద్-బైలా రహదారిలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదస్థలం కొండలోయలో కావడంతో అత్యవసర సేవలు అందించడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డెహ్రడూన్కు ఘటన స్థలం 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సేవలు అందిస్తున్నారు. బస్సు చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
