Covid Vaccination: దేశంలో 86 శాతం మంది పెద్దలకు వ్యాక్సినేషన్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఇప్పటివరకు 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వారికి కొవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్ రెండో డోస్కు అత్యవసర వినియోగానికి అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాను దేశంలో 12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు ఇస్తున్నారు. కార్బెవ్యాక్స్ టీకాను 12 నుంచి 15 ఏళ్ల వారికి ఇస్తున్నారు. తాజాగా ఈ రెండు టీకాలను ఇంకా తక్కువ వయసు ఉన్న పిల్లలకు సైతం ఇచ్చేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. కొవాగ్జిన్ టీకాను 2 నుంచి 18 ఏళ్ల పిల్లలపై పరీక్షించి చూసినప్పుడు, పెద్దలతో పోల్చినప్పుడు పిల్లల్లో ఈ టీకా అధిక ప్రభావం చూపించిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. గత ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఈ పరీక్షలు నిర్వహించి సంబంధిత సమాచారాన్ని సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్కు అందించినట్లు తెలిపింది. దీంతో కొవాగ్జిన్ టీకా అత్యంత భద్రత కలిగి ఉందని నిర్ధారణ అయినట్లు పేర్కొంది. ప్రస్తుత అవసరాలకు తగినన్ని టీకా నిల్వలు తమ దగ్గర ఉన్నాయని భారత్ బయోటెక్ వివరించింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
Way to go!
Over 86% of the adult population is now fully vaccinated.
Together, let's defeat #COVID19.
चरैवेति चरैवेति! pic.twitter.com/4ajcEok33Q
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 26, 2022
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..