విజయ దశమి రోజున గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మెహసానా జిల్లాలోని కడి తాలూకాలోని జసల్పూర్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ గోడ కూలి ఏడుగురు మరణించారని మెహసానా జిల్లా ఎస్పీ తరుణ్ దుగ్గల్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. సంఘటనాస్థలిలో అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయి. క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేసి ఆస్పత్రికి తరలిస్తున్నారు.
Gujarat: గుజరాత్లో విషాదం.. గోడ కూలి ఏడుగురు మృతి
- విజయ దశమి రోజున గుజరాత్లో ఘోర విషాదం
- గోడ కూలి ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు