Oil Tanker Accident: ముంబై-పూణే హైవేపై బోల్తాపడిన పెట్రోల్ ట్యాంకర్.. నలుగురు దుర్మరణం..

Petrol Tanker Overturns

Petrol Tanker Overturns

Oil Tanker Accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడటంతో నలుగురు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం ముంబై-పూణే ఎక్స్ ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. లోనావాలకు సమీపంలో ఓవర్ బ్రిడ్జ్ పై ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ ఒక బండరాయిని ఢీకొట్టి బోల్తా పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదం కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యటు చేపట్టారు.

Read Also: Adipurush: థియేటర్లో ఆదిపురుష్ సినిమా చూసేప్పుడు పాటించాల్సిన నియమాలివేనట.. వైరల్ అవుతున్న వాట్సాప్ మెసేజ్!

×
×
Ad

బ్రిడ్జ్ పై పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్యాంకర్ లో ఇంధనం ఉండటంతో దాదాపుగా 10 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ట్యాంకర్ కు అంటుకున్న మంటలు బ్రిడ్జ్ దిగువ భాగం వరకు చేరుకున్నాయి. ఈ ఘటనలో వంతెన కింద బైక్ పై వెళ్తున్న 12 ఏళ్ల చిన్నారి మరణించింది. ఈ ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.