NTV Telugu Site icon

RRR : గోల్డెన్ టెంపుల్ సన్నిధిలో టీం… పిక్ వైరల్

RRR

RRR బృందం సినిమా ప్రమోషన్ల కోసం దేశం మొత్తాన్ని సందర్శిస్తోంది. నిన్న బరోడా, ఢిల్లీలలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న టీం ఇప్పుడు పంజాబ్ కు చేరుకుంది. అక్కడి ఫేమస్ టెంపుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ఆశీర్వాదం కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సందర్శించారు. ముగ్గురూ కస్టమైజ్డ్ RRR ప్రింట్‌తో ఉన్న తెల్లటి కుర్తా పైజామా ధరించి ఆలయానికి వెళ్లారు.

Read Also : MM Keeravaani Chit Chat with NTR and Ram Charan : రామ్, భీమ్ సీక్రెట్స్ బయట పెట్టిన కీరవాణి

ఇక మార్చ్ 21న అంటే ఈరోజు అక్కడే మీడియాతో టిక్ టాక్ ను నిర్వహించనున్నారు. జైపూర్ లో సాయంత్రం 3 గంటలకు, 5 : 10 గంటలకు మరో రెండు ఈవెంట్లు ఉన్నాయి. కాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం స్వాతంత్ర్య సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల పాత్రలతో తెరకెక్కుతున్న కల్పిత కథ. ఈ చిత్రంలో రామ్ చరణ్, అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్, ఒవిలియా మోరిస్, అజయ్ దేవగన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.