Site icon NTV Telugu

Siva Nageswara Rao: ‘దోచేవారెవరురా!?’ సాంగ్ పిక్చరైజేషన్ కు తేజ ఇన్ పుట్స్!

Shiva Nageshwar Rao

Shiva Nageshwar Rao

 

”మనీ, సిసింద్రీ, పట్టుకోండి చూద్దాం” లాంటి విభిన్నమైన, వినోదాత్మక చిత్రాలను రూపొందించిన దర్శకుడు శివనాగేశ్వరరావు ప్రస్తుతం ‘దోచేవారెవరురా’ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఐ.క్యూ. క్రియేషన్స్ పతాకంపై బొడ్డు కోటేశ్వరరావు ఈ సరికొత్త కామెడీ థ్రిల్లర్ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీతో ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ తనయుడు ప్రణవచంద్ర హీరోగా పరిచయం అవుతున్నాడు. అజయ్ ఘోష్, బిత్తిరి సత్తి ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు.

ఈ సినిమాలో బాలెన్స్ ఉన్న చివరి పాటను ఇటీవల రామోజీ ఫిలిమ్ సిటీలో ఓ సెట్ వేసి గ్రాండ్ గా చిత్రీకరించారు. మూవీలో ఓ కీలక సందర్భంలో ఈ పాట రానుంది. హీరోయిన్ మాళవికపై చిత్రీకరించిన ఈ పాటకు శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. విశేషం ఏమంటే… శివ నాగేశ్వరరావుతో ఉన్న ఫ్రెండ్లీ రిలేషన్ తో దర్శకుడు తేజ ఈ పాటకు కొన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ అక్టోబర్ లో జనం ముందుకు రానుంది.

Exit mobile version