టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్య సరైన హిట్ సినిమా లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న హీరో ఇప్పుడు ఏకంగా మూడు, నాలుగు సినిమాలను ప్రకటించేసాడు.. అందులో ఒకటి మనమే సినిమా.. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శర్వ 35 వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పాటకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది.. సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి..
తాజాగా సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.. టీజర్ ను చూస్తుంటే సినిమాను లండన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకేక్కించినట్లు తెలుస్తుంది.. లండన్, యూరప్ లోనే జరుగుతుందని, అనుకోకుండా హీరో, హీరోయిన్ లైఫ్ లోకి ఒక బాబు వస్తే ఏం జరుగుతుంది? ఇంతకీ బాబు కు హీరోకు ఏదైన సంబంధం ఉందా? బాబు ప్లాష్ బ్యాక్ ఏంటి అనే దాని పై సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో హీరో లుక్ స్టైలిష్ గా ఉంది.. ఈ సినిమాను త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు..
