NTV Telugu Site icon

పింక్ శారీలో సాయి పల్లవి రాయల్ లుక్… పిక్స్ వైరల్

Sai Pallavi

శ్యామ్ సింగరాయ్ రాయల్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం హాహారు కాగా, ట్రైలర్ ను కూడా అదే వేదికపై విడుదల చేశారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవికి ఎప్పటిలాగే ఈ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె సినిమా గురించి కూడా చాలా ఉత్సాహంగా మాట్లాడింది.

Read Also : ఆన్లైన్ టిక్కెటింగ్ జీవో రద్దుపై బాలయ్య రియాక్షన్

“శ్యామ్ సింఘా రాయ్ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది. ముగ్గురు వ్యక్తులు… ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, సాను వర్గీస్, కాస్ట్యూమ్ డిజైనర్ నీర్జా కోన… ప్రతి ఫ్రేమ్ రాయల్ గా, మెజెస్టిక్ గా కనిపిస్తుంది. వారి కృషిని గుర్తించి మెచ్చుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మా సినిమా మాత్రమే కాదు, కోవిడ్ కారణంగా ఈ నెలలో రాబోయే అన్ని చిత్రాలను థియేటర్లలో చూడండి. నాని ఫ్యాన్స్ కి పిచ్చెక్కిపోతుంది. ఇది వారికి ట్రీట్ అవుతుంది. నిర్మాత వెంకట్ నేను కలిసిన అత్యంత సానుకూల వ్యక్తి. ఇక మీ నుంచి నాపై చాలా ప్రేమ కురుస్తుంది. అదెలాగో ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ అభిమానులపై ప్రేమను కురిపించింది. ఇక ఈవెంట్ లో పింక్ కలర్ పట్టు శారీలో మెరిసిన ఈ బ్యూటీ అందానికి అందరూ ఫిదా అయ్యారు. సాయి పల్లవికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.