RGV: ఎన్నికల వేళ పొలిటికల్ హీట్ పెంచుతున్న ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RGV announces release dates of Vyuham and Sapatham: ఏపీలో రాజకీయాలు రసరంజకంగా ఉన్నాయి. అక్కడి రాజకీయం సినిమాలకు ఏమాత్రం తక్కువ కాకుండా రోజుకొక ట్విస్టుతో అనేక విషయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇంకా ఎన్నికలకు ఏడెనిమిది నెలలు ఉండగానే అక్కడి పొలిటికల్ హీట్ ఒక రేంజ్ లో ఉండే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అక్కడి రాజకీయాలు ఇలా ఉండగా ఇప్పుడు సంచలన సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన వంతుగా మరింత వేడి పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పాలి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆయన వైసీపీకి అనుకూలం అని టీడీపీ ఆరోపించే విధంగా రెండు సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వ్యూహం, వ్యూహం-2 (శపథం) పేర్లతో రెండు పార్టులుగా ఈ సినిమాలు తెరకెక్కిస్తున్న వర్ట్మ ఇపుడు ఈ సినిమాల రిలీజ్ డేట్లు ప్రకటించి మరింత చర్చనీయాంశం అయ్యారు. నిజానికి ఈ సినిమాల అనౌన్స్ మెంట్ల నుంచి చూస్తే కనుక ఈ సినిమాల పోస్టర్లు, టీజర్లు సంచలనం రేపడమే కాదు పొలిటికల్ దుమారానికి కూడా కారణం అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ చెబుతున్న దాన్ని బట్టి వైఎస్ మరణం తర్వాత జరిగిన పరిస్థితులు, జగన్ పై కేసులను ‘వ్యూహం’ సినిమాలో చూపించనుండగా కఠిన పరిస్థితులను ఎదుర్కొంటూనే ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని ‘శపథం’లో చూపబోతున్నారు అని అంటున్నారు.
Also Read
- Raaka: 'రాకా'లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
- Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
- Fauzi Shooting Update: 'ఫౌజీ' కోసం డార్లింగ్ స్పీడ్ చూసి ఫ్యాన్స్ ఫిదా! ఒకేసారి రెండు యూనిట్స్..
- Spirit: స్పిరిట్ షూటింగ్'కి నెల రోజుల బ్రేక్
ఇక ఈ రెండు భాగాల్లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, వైఎస్ భారతి పాత్రలో మానస నటించారు. దాసరి కిరణ్ కుమార్ ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నారు, గతంలో ఈయన రామ్ గోపాల్ వర్మతో వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి సినిమాలను నిర్మించారు. ఇక ఈ సినిమాల విడుదల తేదీలను రామ్ గోపాల్ వర్మ తాజాగా ప్రకటించారు. ‘వ్యూహం’ సినిమాను నవంబర్ 10న అంటే దాదాపుగా మరో నెల రోజులలో రిలీజ్ చేయనుండగా ‘శపథం’ సినిమాను మాత్రం ఎన్నికలకు సరిగ్గా కొన్ని నెలల ముందు జనవరి 25న విడుదల చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వైసీపీకి ప్లస్ అయ్యేలా టీడీపీ అధినేత గతంలో రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు లాంటి సినిమాలు తెరకెక్కించారు. వర్మ తనకు ఎలాంటి రాజకీయ సపోర్ట్ లేదని చెబుతున్నా ఆయన చేస్తున్న సినిమాలు కొంతవరకు వైసీపీకి సపోర్ట్ గానే ఉంటాయి. దీంతో ఆ సినిమాను టీడీపీ ఖచ్చితంగా టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి రామ్ గోపాల్ వర్మ ఎలాంటి పొలిటికల్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారతాడు అనేది.
తాజావార్తలు
-
Raaka: ‘రాకా’లో షారుఖ్ ఉన్నారా? వైరల్ అవుతున్న గెస్ట్ రోల్ వార్తలపై క్లారిటీ!
-
Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
-
Oppo F35 Pro: ఒప్పో F35 ప్రో భారత్ లో రిలీజ్ కు రెడీ.. 10,000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫోన్!
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!