NTV Telugu Site icon

Emergency: కంగనాకు సెన్సార్ బోర్డ్ షాక్.. “ఎమర్జెన్సీ” విడుదల వాయిదా..?

Emergency

Emergency

Emergency: నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కొత్త సినిమా ‘‘ఎమర్జెన్సీ’’ వివాదాస్పదమవుతోంది. ఈ సినిమా విడుదల మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన పాలనలో విధించిన ‘ఎమర్జెన్సీ’ ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. అయితే, ఇందులో సిక్కు కమ్యూనిటీని ఉద్దేశించి చెడుగా చూపించే కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆ వర్గం సినిమాని వ్యతిరేకించడంతో వివాదం నెలకొంది.

Read Also: Kolkata Rape Case: కోల్‌కతాలో కొనసాగుతున్న నిరసనలు.. పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు

ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ప్రతీ వర్గం యొక్క మనోభావాలను పరిగణలోకి తీసుకుంటామని సెన్సార్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ సినిమాకు మరిన్ని కట్స్‌ని బోర్డు కోరినట్లు తెలుస్తోంది. నిజానికి సినిమాని సెప్టెంబర్ 6న విడుదల చేయాల్సి ఉంది. దీంతో బోర్డు మర్ని కోతలని కోరడంతో సినిమా విడుదల వాయిదా పడింది.