Prudhvi Raj: నటుడు పృథ్వీరాజ్ కి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!
- నటుడు పృథ్వీరాజ్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- మనోవర్తి చెల్లింపుపై ఘటనలో కోర్టును ఆశ్రయించిన పృథ్వి భార్య శ్రీలక్ష్మి
- కోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
Non Bailable Arrest Warrant o Prudhvi Raj: సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పృధ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి తనకు మనోవర్తి చెల్లించే అంశం మీద కోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు చెల్లించాల్సిన మనోవర్తి బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
Chandrababu: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Sankranthi 2027 : సంక్రాంతికి రావిపూడి పక్కా.. నో డౌట్స్!
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్ కి 84 లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పృద్వికి ఆయన భార్యకు వివాదాల ఏర్పడిన నేపథ్యంలో వారు విడిగానే ఉంటున్నారు. శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటూ 2017లో కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. పృథ్వీరాజ్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని అయితే సినిమాల్లోకి వెళ్లాక తనను వేధిస్తూ ఉండేవాడని, 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె అప్పట్లో ఫిర్యాదు చేశారు.
అప్పట్లోనే తన భర్త సినిమాలో టీవీ సీరియల్స్ చేస్తూ నెలకు ₹30 లక్షల సంపాదిస్తున్నారు కాబట్టి భరణం ఇప్పించాలని 2017లో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు 2022లో వెలువడింది. అప్పటివరకు ఆమెకు ఖర్చయిన కోర్టు ఖర్చులతో పాటు ప్రతినెలా ఎనిమిది లక్షలు పదో తేదీ లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతోని పృథ్వీరాజ్ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో వైసీపీలో ఆక్టివ్ గా ఉన్న ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా స్వీకరించారు. తర్వాత పలు వివాదాలతో తప్పుకున్నారు. తర్వాత జనసేనకు దగ్గర వైసిపి మీద ఫైర్ అవుతూ ఉండేవారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో