Prudhvi Raj: నటుడు పృథ్వీరాజ్ కి షాక్.. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ!
- నటుడు పృథ్వీరాజ్ కి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- మనోవర్తి చెల్లింపుపై ఘటనలో కోర్టును ఆశ్రయించిన పృథ్వి భార్య శ్రీలక్ష్మి
- కోర్టు ఆదేశాలు పాటించక పోవటంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Non Bailable Arrest Warrant o Prudhvi Raj: సినీ పరిశ్రమలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్విగా ఫేమస్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్ కి విజయవాడ ఫ్యామిలీ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పృధ్వీరాజ్ భార్య శ్రీలక్ష్మి తనకు మనోవర్తి చెల్లించే అంశం మీద కోర్టును ఆశ్రయించగా ఆ కేసులో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆమెకు చెల్లించాల్సిన మనోవర్తి బకాయిలు చెల్లించాలని గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పాటించకపోవడంతో పాటు కోర్టుకు హాజరు కాకపోవడంతో తాజాగా నాన్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
Chandrababu: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం చంద్రబాబు
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడానికి చెందిన బలిరెడ్డి పృథ్వీరాజ్ కి 84 లో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే పృద్వికి ఆయన భార్యకు వివాదాల ఏర్పడిన నేపథ్యంలో వారు విడిగానే ఉంటున్నారు. శ్రీలక్ష్మి తన పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటూ 2017లో కోర్టును ఆశ్రయించింది. భర్త నుంచి తనకు నెలకు ఎనిమిది లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. పృథ్వీరాజ్ సినిమాల్లో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఖర్చులన్నీ తన కుటుంబమే భరించిందని అయితే సినిమాల్లోకి వెళ్లాక తనను వేధిస్తూ ఉండేవాడని, 2016లో తనను బయటకు పంపించడంతో పుట్టింటికి వచ్చి ఉంటున్నానని ఆమె అప్పట్లో ఫిర్యాదు చేశారు.
అప్పట్లోనే తన భర్త సినిమాలో టీవీ సీరియల్స్ చేస్తూ నెలకు ₹30 లక్షల సంపాదిస్తున్నారు కాబట్టి భరణం ఇప్పించాలని 2017లో కేసు దాఖలు చేశారు. దీనికి సంబంధించిన తీర్పు 2022లో వెలువడింది. అప్పటివరకు ఆమెకు ఖర్చయిన కోర్టు ఖర్చులతో పాటు ప్రతినెలా ఎనిమిది లక్షలు పదో తేదీ లోపు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలు పాటించకపోవడంతోని పృథ్వీరాజ్ మీద నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. గతంలో వైసీపీలో ఆక్టివ్ గా ఉన్న ఆయన ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా స్వీకరించారు. తర్వాత పలు వివాదాలతో తప్పుకున్నారు. తర్వాత జనసేనకు దగ్గర వైసిపి మీద ఫైర్ అవుతూ ఉండేవారు.
తాజావార్తలు
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!