నేపాలీ బాల… మనీషా కొయిరాల…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
(ఆగస్టు 16న మనీషా కొయిరాల బర్త్ డే)
లేలేత అందాలు, నాజూకు షోకులతో జనం ముందు నిలచిన మనీషా కొయిరాలను చూడగానే ‘నేపాలీ బాల’ అన్నారు ప్రేక్షకులు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా వయసు మీద పడుతున్నా, ఆమెను ఇంకా ‘నేపాలీ బాల’గానే గుర్తిస్తూ ఉండడం విశేషం. ఖాట్మాండ్ లో పుట్టినా, హిందీ సినిమాలతోనే మన జనానికి సుపరిచితురాలయింది మనీషా. కేన్సర్ ను సైతం జయించి, ఆ వ్యాధిపై జనాల్లో అవగాహన కలిగించేందుకు కృషి చేస్తున్నారామె. మహిళా హక్కుల కోసం కూడా మనీషా తనదైన రీతిలో పోరాటం సాగిస్తున్నారు.
Also Read
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
- Nagadurga: సుకుమార్ - బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
- Viswanath and Sons : అనిల్ రావిపూడి తరహాలో వెంకీ అట్లూరి... ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ తోనే ప్రమోషన్స్ షురూ....
- Anandita Surgery Rumours : అలాంటి సర్జరీలు చేయించుకోలేదు... ట్రోలర్స్ పై మండిపడ్డ ఖుష్బూ కూతురు
మన సరిహద్దుల్లో ఉన్న నేపాల్ అసలైన హిందూ దేశం అని ఎంతోమంది అంటూ ఉంటారు. అక్కడ కొయిరాలా వంశస్థులు అనేక దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఒకప్పటి నేపాల్ ప్రధాన మంత్రి బిశ్వేశ్వర్ ప్రసాద్ కొయిరాల మనవరాలు మనీషా. ఆమె తండ్రి ప్రకాశ్ కొయిరాల కూడా పర్యావరణ, శాస్త్ర సాంకేతిక మంత్రిగా నేపాల్ ప్రభుత్వంలో పనిచేశారు. ప్రకాశ్ బాల్యం నుంచీ మనీషాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. చదువుకొనే రోజుల్లోనే థియేటర్ ఆర్ట్స్ పై మనసు పారేసుకుంది కొయిరాల. స్కూల్ లో కొన్ని నాటకాల్లో నటించిన మనీషా 1989లో ‘ఫెరీ భేతౌల’ అనే నేపాలీ చిత్రంలో తొలిసారి నటించింది. ఆ తరువాత సుభాష్ ఘయ్ తెరకెక్కించిన ‘సౌదాగర్’తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టింది. అప్పటి నుంచీ తన దరికి చేరిన పాత్రల్లో నటించేస్తూ అనతికాలంలోనే నటిగా మంచి పేరు సంపాదించింది మనీషా కొయిరాల. మణిరత్నం తెరకెక్కించిన ‘బొంబాయి’ సినిమాతో దక్షిణాదికి వచ్చిన మనీషా, నాగార్జున ‘క్రిమినల్’లోనూ నటించి, తెలుగువారిని ఆకట్టుకుంది. శంకర్ తెరకెక్కించిన ‘భారతీయుడు, ఒకే ఒక్కడు’ చిత్రాలలోనూ మనీషా అందాలు జనాన్ని మురిపించాయి. రజనీకాంత్ ‘బాబా’లోనూ మనీషా నటించి ఆకట్టుకుంది. శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘నగరం’ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ లో చిందేసింది మనీషా. 2014లో కేన్సర్ ను జయించిన మనీషా ఆ తరువాత నుంచీ మళ్ళీ నటించసాగారు. నెట్ ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్’లో ఓ కథలో నాయికగా నటించారామె. సంజయ్ దత్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘సంజూ’లో ఆయన తల్లి నర్గీస్ పాత్రలోనూ మనీషా మురిపించారు.
ఇప్పటికీ తనకు నచ్చిన పాత్రల్లో నటించడానికి మనీషా కొయిరాల ఉత్సాహంగానే ఉన్నారు. అలాగే సామాజిక సేవలోనూ తనవంతు కృషి చేస్తున్నారు. మనీషా మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?