డివైన్ బ్లాక్ బస్టర్ ‘కన్నప్ప’ తరువాత విష్ణు మంచు నుండి ఎలాంటి అప్డేట్ లేదు. స్టార్ వాల్యూ తో కన్నప్ప కు భారీ కలెక్షన్స్ రాబట్టాడు విష్ణు. మంచు హీరో నెక్ట్స్ సినిమా ఏంటన్నది క్లారిటీ లేదు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం విష్ణు ఇప్పుడు మైక్రో డ్రామాలపై వంద కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయించుకున్నారట.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసేందుకు విష్ణు మంచు ముందడుగు వేయబోతోన్నారు. మైక్రోడ్రామాలతో విష్ణు మిరాకిల్స్ చేయబోతోన్నారు. మూడు నుంచి ఏడు నిమిషాల వ్యవధితో సాగే ఎపిసోడ్స్ని మైక్రో డ్రామాలు అని చెప్పుకోవచ్చు. మొబైల్లో యూజర్స్కి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇచ్చేలా వాటిని రూపొందించాలని విష్ణు నిర్ణయించుకున్నారు. సాధారణ రీల్స్ మాదిరిగా కాకుండా, పూర్తి స్థాయి నిర్మాణం, ప్రొఫెషనల్ దర్శకత్వం, ఎఫెక్టివ్ స్టోరీ, నెరేషన్తో ఈ మైక్రో డ్రామాల్ని రూపొందించనున్నారట. ఈ ఏడాది ‘కన్నప్ప’తో హిట్ అందుకున్న విష్ణు ఇప్పడు ఈ ప్రయోగానికి తెరలేపాడు. ఈ కొత్త వెంచర్ భారతీయ వినోదంలో గేమ్-ఛేంజింగ్గా మారుతుందని అంతా అనుకుంటున్నారు. ఈ పరిణామం గురించి తెలిసిన పరిశ్రమ వర్గాలు. అయితే ఈ మైక్రో డ్రామాలో మంచి విష్ణు కూడా నటిస్తాడా అనేది క్లారిటీ లేదు. కన్నప్ప సంచలనం చేసిన మంచు స్టార్ ఇప్పుడు ఈ మైక్రో డ్రామాలతో ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తారో చూడాలి. ఓ వైపు వంద కోట్లు పెట్టుబడులు పెడుతూనే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాల్ని కూడా విష్ణు పట్టాలెక్కిస్తున్నారని సమాచారం. కన్నప్పతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు మంచు విష్ణు.
