Site icon NTV Telugu

ఆఫ్ఘన్ కాందిశీకుల వెతలపై ‘గార్డ్’ చిత్రం!

Garud film on Afghan rescue crisis announced

ప్రస్తుతం జాన్ అబ్రహం హీరోగా ‘అటాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్న అజయ్ కపూర్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుభాష్‌ కాలేతో కలిసి భారీ స్థాయిలో ‘గార్డ్’ మూవీని నిర్మించబోతున్నాడు. ఆఫ్ఘన్ కాందిశీకుల వేతల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ మూవీ ప్రకటనతో పాటు నిర్మాతలు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘పరమాణు’, ‘రోమియో అక్బర్ వాల్తేర్’, ‘బేబీ’, ‘ఎయిర్ లిఫ్ట్’ తర్వాత ఆ తరహాలోనే ‘అటాక్’, ‘గార్డ్’ చిత్రాలను అజయ్ కపూర్ నిర్మిస్తున్నారు. ఇక సుభాష్ కాలేతో కలిసి ‘రాయ్’, ‘ఆల్ ఈజ్ వెల్’ తర్వాత మరోసారి వీరిద్దరూ ‘గార్డ్’ కోసం జత కట్టడం విశేషం.

Read Also : బాలకృష్ణ సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ

‘గార్డ్’ మూవీ గురించి అజయ్ కపూర్ మాట్లాడుతూ, ”సుభాష్, నేను కలిసి కొన్నేళ్ళుగా ప్రయాణం సాగిస్తున్నాం. అతను ఇటీవల ‘గార్డ్’ స్క్రిప్ట్ చెప్పగానే నాకు నచ్చేసింది. వెంటనే అంగీకారాన్ని తెలిపాను. ఈ కథలో భావోద్వేగాలతో పాటు దేశభక్తి పూరితమైన అంశాలు, స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉన్నాయి. ఈ కథకు సంపూర్ణ న్యాయం చేకూర్చడం కోసం ఈ సినిమాను భారీగా ప్లాన్ చేశాం” అని అన్నారు. మరో నిర్మాత సుభాష్‌ కాలే మాట్లాడుతూ, ”’గార్డ్‌’ నాకు వెరీ స్పెషల్ ప్రాజెక్ట్. ఈ కథ మీద కొంతకాలంగా వర్క్ చేస్తూ ఉన్నాను. దీనికి అజయ్ కపూర్ లాంటి నిర్మాత సాయం దొరకడం ఆనందంగా ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాసుకున్న ఈ కథను అంతర్జాతీయ స్థాయిలో తెరపై చూపించాలన్నది మా కోరిక’ అని అన్నారు.

ఈ చిత్రం కోసం ‘మేరా భారత్ హై మహాన్’ అంటూ ఓ నేపథ్య గీతాన్ని ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ‘మిషన్ మంగళ్’కు రచన చేసిన నిధి సింగ్ ధర్మా వర్క్ చేశారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణులతో పాటు దర్శకుడి వివరాలను త్వరలోనే ప్రకటించబోతున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది ఆగస్ట్ 15న విడుదల స్వాతంత్రదినోత్సవ కానుకగా విడుదల కానుంది.

Exit mobile version