NTV Telugu Site icon

Suriya: కొత్త వివాదంలో హీరో సూర్య.. అసలేమైందంటే?

Suriya House Protection

Suriya House Protection

Free police protection to Suriya House With Government Expense: గత రెండున్నరేళ్లుగా నటుడు సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో పోలీసు రక్షణ కల్పిస్తున్నారనే వార్త ఇప్పుడు తమిళ మీడియాలో సంచలనం సృష్టించింది. ఎందుకనే ప్రస్తుతం సూర్య తన కుటుంబంతో ముంబైలో నివసిస్తున్నప్పటికీ, అతని చెన్నై ఇంటికి భద్రత కల్పిస్తున్నారు. సూర్య నటించిన చిత్రం జైబీమ్‌(2021)పై పాటలీ పీపుల్స్ పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. పలువురు సూర్యను బెదిరించడంతో చెన్నైలోని త్యాగరాయ నగర్‌లోని నటుడు సూర్య ఇంటికి పోలీసు భద్రత కల్పించారు. చివరకు సమస్య ఓ కొలిక్కి రాక పోవడంతో సూర్య తదుపరి చిత్రంపై కూడా వారు నిరసన వ్యక్తం చేశారు.

Average Student Nani: ఇంతకు తెగించారు ఏంట్రా?.. షర్ట్స్ లేకుండా హీరోహీరోయిన్ల లుక్ వైరల్

కొన్ని జిల్లాల్లోని థియేటర్లలో సినిమాను ప్రదర్శించవద్దని హెచ్చరించారు. దీంతో సూర్య టీ.నగర్ ఇంటికి పోలీసు భద్రతను పెంచారు. వివాదాలు సద్దుమణిగిన తర్వాత కూడా సూర్య ఇంటికి పోలీసు భద్రతను ఇప్పటి వరకు ఉపసంహరించుకోలేదు. సూర్య ఇంటి ముందు సాయుధ బలగాలకు చెందిన నలుగురు పోలీసులు బందోబస్తులో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం సూర్య తన భార్య, పిల్లలతో కలిసి ముంబైలో ఉంటున్నారు. అయితే ఆయన చెన్నై ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు భద్రత కల్పిస్తున్నారనే ప్రశ్నలు పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి.

ఈ విషయమై సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి సమాచార హక్కు చట్టం కింద ఎవరి ఆదేశాల మేరకు, ఏ తేదీ నుంచి సాయుధ పోలీసులను నటుడి ఇంటికి నియమించారని ప్రశ్నించారు. RTI ద్వారా ఇచ్చిన సమాధానంలో, “పోలీస్ కమీషనర్ ఆదేశం ప్రకారం, నవంబర్ 15, 2021 నుంచి తాత్కాలికంగా భద్రత కల్పించబడింది. కొనసాగుతున్న బెదిరింపుల కారణంగా, భద్రతా సమీక్ష కమిటీ వారి నిర్ణయం ప్రకారం భద్రత కల్పిస్తున్నారు..” అలాగే సూర్య పోలీస్ ప్రొటెక్షన్ కోసం ఏమైనా చెల్లిస్తున్నారా అనే ప్రశ్నకు ‘నో’ అనే సమాధానం ఇచ్చారు. ఆ లెక్కన రెండున్నరేళ్లుగా నటుడు సూర్య ఇంటికి ప్రభుత్వ ఖర్చుతో ఎందుకు భద్రత కల్పిస్తున్నారని సామాజిక కార్యకర్త కృష్ణమూర్తి ప్రశ్నించారు.