NTV Telugu Site icon

Poonam Pandey: మా మనోభావాలు దెబ్బ తీసింది.. 100 కోట్లు కట్టాలంటూ పూనమ్ పాండేపై దావా

poonam pandey

poonam pandey

Faizan Ansari’s Defamation Claim Of Rs 100 Crore on Poonam Pandey: నటి పూనమ్ పాండే చికిత్స పొందుతూ గర్భాశయ ముఖద్వార (సర్వైకల్) క్యాన్సర్‌తో మరణించినట్లు సోషల్ మీడియాలో స్వయంగా ఆమె ఖాతా నుంచి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది. ఇక ఈ కేసులో రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేశారు. ఇక ఈ క్రమంలో సీపీ అఖిల్ కుమార్ ఈ విషయం మీద విచారణకు ఆదేశించారు. సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. దీంతో పాటు ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నారు. పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ అన్నారు. ప్రకటించిన రోజే నటి పూనమ్ పాండే మరణ వార్త రోజంతా చర్చనీయాంశంగా ఉంది. అయితే ఒక రోజు తర్వాత ఆమె సజీవంగా ఉందని మరియు ఆమె మరణ వార్త నకిలీదని మరొక వార్త వచ్చింది.

Ruhani Sharma: ‘ఆపరేషన్ వాలెంటైన్’లో తాన్య శర్మగా రుహానీ శర్మ.. లుక్ అదిరింది బాసూ

పూనమ్ చనిపోయిందని ఆమె మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సమాచారం మోడల్ యొక్క అధికారిక Instagram హ్యాండిల్ నుండి పోస్ట్ చేయడంతో అది నిజమే అని అందరూ అనుకున్నారు. ఆమె యుపిలోని కాన్పూర్ నివాసి అని కూడా ప్రచారం జరిగింది కానీ నిజానికి ఆమె ముంబైలో పుట్టి అక్కడే చదువుకున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా ముంబై వాసులే. ఇక కొంత కాలం క్రితం ముంబైలో ఉర్ఫీ జావేద్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఫైజాన్ అన్సారీనే ఇప్పుడు పూనమ్ పాండే మీద పరువు నష్టం దావా వేయడం గమనార్హం. తప్పుడు పబ్లిక్ అటెన్షన్ కోసం పూనమ్ పాండే ఇలాంటి పని చేస్తూనే ఉందని ఆయన అన్నారు. భారత్‌ ప్రపంచకప్‌ గెలిస్తే బట్టలు విప్పి మైదానంలోకి పరుగెత్తుతానని ఆమె కొంతకాలం క్రితం ప్రకటన ఇచ్చింది. పబ్లిక్ గా ఒకరి జీవితంతో ఆడుకోవడం లేదా ఒకరి భావాలతో ఆడుకోవడం తప్పు, ఈ విషయంలో ఆమె బుద్ధి చెప్పాలనే నేను కాన్పూర్ వచ్చానని ఆయన అన్నారు.