విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇప్పుడు ‘కర’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘పోర్ తొజిల్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విగ్నేష్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
ఈ సినిమాలో ధనుష్ ఒక దొంగగా, అదే సమయంలో గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టాలు పడే ఒక సామాన్యుడిగా కనిపిస్తున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఆ ఇంటెన్సిటీ చూస్తుంటే మరో నేషనల్ అవార్డు గ్యారెంటీ అనిపిస్తోంది. ముఖ్యంగా ‘ప్రేమలు’లో గ్లామరస్గా కనిపించిన మమితా బైజు, ఇందులో ధనుష్ భార్యగా పూర్తి డీ-గ్లామ్ పాత్రలో నటించింది. ఒక మధ్యతరగతి గృహిణిగా ఆమె పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రాణంగా నిలవనుంది. గల్ఫ్ దేశాల్లో మారిన పరిస్థితులు, అక్కడి చట్టాలు భారత్ నుంచి వెళ్ళిన కార్మికులపై ఎలాంటి ప్రభావం చూపించాయి? అనే సున్నితమైన అంశాన్ని దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్తో కలిపి చూపించినట్లు అర్థమవుతోంది.
సినిమాలోని నాచురాలిటీని దెబ్బతీయకుండా కెమెరా వర్క్, మ్యూజిక్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. ట్రైలర్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ను ఎలివేట్ చేస్తోంది. ఇప్పటికే జరిగిన తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ‘కర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సహజత్వానికి దగ్గరగా ఉండే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘కర’ ఒక ఐ-ఫీస్ట్ కానుంది. ఏప్రిల్ 30న థియేటర్లలో ధనుష్ తన గర్జన ఎలా వినిపిస్తాడో వేచి చూడాలి.
