ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుసామితో చేస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ‘రాపో19’ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ద్వారా రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. లింగుస్వామికి తెలుగులో ఇదే తొలి చిత్రం. గతంలో ఆయన విశాల్ ‘పందెంకోడి’ చిత్రానికి దర్శకత్వం వహించగా… ఆ చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఎస్ఎస్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే తాజాగా ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గతంలో రామ్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంలోని సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న విషయం తెలిసిందే.