Tollywood: పర్సంటేజీ ఇష్యూ.. శిరీష్ రెడ్డికి మైత్రి రవి స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాతలు – ఎగ్జిబిటర్ల మధ్య జరుగుతున్న ‘పర్సెంటేజ్ వర్సెస్ రెంటల్’ వివాదం ఇప్పుడు పీక్ స్టేజ్కు చేరుకుంది. తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో శిరీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున నిర్మాత రవిశంకర్ ఘాటుగా సమాధానమిచ్చారు. శిరీష్ రెడ్డి వ్యాఖ్యలపై రవిశంకర్ మండిపడుతూ.. “మీ చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు కాబట్టే, ఇప్పుడే పర్సెంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు” అని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పరిశ్రమలో గందరగోళం సృష్టించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదం మూలాలను గుర్తు చేస్తూ రవిశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈ సమస్య మొదలైంది. ఆ తర్వాత మీరు వార్ 2, కూలీ, ఓజీ, అఖండ, నారీ నారీ నడుమ మురారి, చిరంజీవి గారి విశ్వంభర వంటి ఎన్నో భారీ చిత్రాలను రిలీజ్ చేశారు. ఇన్ని సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాలు మీకు కనిపించలేదా? అప్పుడు పర్సెంటేజ్ సిస్టమ్ ఎందుకు గుర్తుకు రాలేదు?” అని సూటిగా ప్రశ్నించారు.
వివాదం నేపథ్యం ఇదే..
ప్రస్తుతం ఉన్న రెంటల్ (అద్దె) పద్ధతి వల్ల సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టపోతున్నాయని, కాబట్టి టికెట్ ఆదాయంలో వాటా (పర్సెంటేజ్) ఇచ్చే విధానం రావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే థియేటర్లు మూసివేస్తామని హెచ్చరిస్తున్నారు. మొదటి వారంలోనే రికవరీ కావాల్సిన పెద్ద సినిమాలకు పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 4న రిలీజ్ కానున్న రామ్ చరణ్ ‘పెద్ది’ (Peddi) సినిమాపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తెలుగు ఫిలిం ఛాంబర్లోని పెద్దలు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారో, ఈ ‘పర్సెంటేజ్’ వార్ ఎటు దారితీస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..