మలయాళ హిట్ మూవీ “అయ్యప్పనుమ్ కోషియమ్” చిత్రం తెలుగులో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ మల్టీస్టారర్ లో పవన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుంది. సీతారా ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఈ నెల 12న ప్రారంభం కానుంది.
Read Also : అందాల విందుతో కవ్విస్తున్న మౌనిరాయ్
ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పై సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. ఈ సినిమా షూటింగ్ జూలై 11న ప్రారంభం కానుందని ప్రచారం జరుగుతోంది. కానీ సన్నిహిత వర్గాల సమాచారం మేరకు మేకర్స్ జూలై 12న సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు. నిత్యామీనన్ కూడా సినిమా సెట్లో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ షెడ్యూల్ లోనే పవన్ పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. పవన్ కళ్యాణ్ కొంతకాలం క్రితం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన కరోనా నుంచి పూర్తిగా కోలుకోవడంతో షూటింగ్ కు సిద్ధమవుతున్నారు.