వర్సటైల్ స్టార్ సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ నెల 14న రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఆటనుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దానికి తోడు ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి యునానిమస్ గా మంచి రెస్పాన్స్ తెచుకుంది. డే వన్ నుండి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబడుతున్న ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును దాటి సంచలనం సృష్టించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ ఊహించని రికార్డు కలెక్షన్లకు సంబంధించిన ఒక ప్రత్యేక పోస్టర్ను కూడా మేకర్స్ విడుదల చేశారు.
క్లీన్ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, ఓవర్సీస్ మార్కెట్లలోనూ హౌస్ఫుల్ బోర్డులతో ప్రదర్శితమవుతూ బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తోంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వస్తున్న జనం ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా విజయానికి ముఖ్యంగా సూర్య వన్-మ్యాన్ షోకు తోడు మమితా బైజు నటన సినిమాలోని ఎమోషన్ బాగా ఆకట్టుకుంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కథను మరో స్థాయికి తీసుకెళ్లాయి. మాస్, క్లాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ వీకెండ్లో మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రోజు హాలిడే కావడంతో ఉదయం ఆటలు హౌస్ ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్, సెకండ్ షోస్ కు డిమాండ్ మేరకు మరికొన్ని సెంటర్స్ అదనంగా యాడ్ చేస్తున్నారు.

