ఎస్జిఎస్వి మూవీస్ పతాకంపై బాలు చరణ్, కాజల్ తివారి హీరో హీరోయిన్ గా నర్తు చిరంజీవి దర్శకత్వం లో ఎమ్ పవన్ కుమార్ నిర్మిస్తున్న సస్పెన్స్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “సుగ్రీవ” అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ “సుగ్రీవ” ఒక అందమైన కుటుంబ కథ చిత్రం. ఆనందంగా జీవిస్తున్న కుటుంబం లో అనుకోని సంఘటనలు ఎదురైతే ఆ కుటుంబం ఎలాంటి పరిణామాలు ఎదురుకుంటుంది, వాళ్ళు ఆ సమస్యలు ఎలా ఎదుర్కున్నారు అనేదే కథ. సినిమా చాలా బాగా వచ్చింది. నిర్మాత ఎమ్ పవన్ కుమార్ గారు ఎక్కడ రాజీ పడకుండా చిత్రాన్ని నిర్మించారు. నర్తు చిరంజీవి గారి దర్శకత్వం అద్భుతంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి, గోవా మరియు వైజాగ్ లాంటి అద్భుతమైన లొకేషన్స్ లో పాటలు చిత్రీకరించారు. సారధి స్టూడియోస్ లో డి ఐ తో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని 24 న విడుదలకు సిద్ధంగా ఉంది” అని తెలిపారు.