Site icon NTV Telugu

క్రేజీ ప్రాజెక్ట్ లో నితిన్ స్థానంలో శర్వానంద్ ?

Sharwanand Replaces Nithiin Power Peta ?

యంగ్ హీరో నితిన్ హీరోగా తెరకెక్కాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ “పవర్ పేట” ఆగిపోయిందనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రూపొందాల్సి ఉండగా… ఇందులో నుంచి నితిన్ బయటకు వెళ్లిపోయాడని, ఈ చిత్రాన్ని మేకర్స్ రెండు భాగాలుగా తెరకెక్కించాలనే ప్రతిపాదించడం, అందుకు చాలా టైం పడుతుందన్న ఉద్దేశ్యంతోనే నితిన్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం దర్శకుడు కృష్ణ చైతన్య ఈ చిత్రం కోసం శర్వానంద్‌ను సంప్రదించారట. శర్వా త్వరలోనే ఈ చిత్రానికి తన ఆమోదం తెలిపే అవకాశం ఉందని అంటున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. “పవర్ పేట” రెండు భాగాలుగా తెరకెక్కనుండగా… దీని కథ 1960-2021 ఉండనుందట. ఇందులో శర్వానంద్ 3 పాత్రల్లో కనిపించనున్నాడు. ఒకటి 18 ఏళ్ల టీనేజ్, రెండవది 40 ఏళ్ల వ్యక్తి, మూడవది 60 సంవత్సరాల ముసలివాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. కాగా ప్రస్తుతం శర్వానంద్ “మహాసముద్రం”, “ఆడవాళ్ళూ మీకు జోహార్లు” అనే చిత్రాల్లో నటిస్తున్నారు.

Exit mobile version