డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుప్రీం హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో తెలంగాణలో లాక్ డౌన్ కూడా ఎత్తివేశారు. దీంతో సినిమాల కార్యకలాపాలు తిరిగి పుంజుకుంటున్నాయి. తాజాగా సాయి ధరమ్ తేజ్ కూడా “రిపబ్లిక్” కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశారు.
Read Also : మరో మైల్ స్టోన్ చేరుకున్న మెగా పవర్ స్టార్
Also Read
- Nick Jonas: హాలీవుడ్ రేంజ్కి ఎదిగిన బాలీవుడ్ హీరోయిన్తో తన ప్రేమ ఎలా మొదలైందో చెప్పిన ప్రియాంక చోప్రా భర్త!
- Grand Comeback: హ్యాట్రిక్ ప్లాన్తో వస్తున్న హీరో.. గ్రాండ్ కంబ్యాక్కు మాస్టర్ స్ట్రాటజీ!
- SS Rajamouli: ఎవరూ ఊహించని హీరోతో దర్శకధీరుడు రాజమౌళి కొత్త సినిమా?
- Bhagyanagaramloo Saradhi Prema: ఆకట్టుకుంటున్న లవ్ ఎమోషనల్ డ్రామా
ఇక కరోనా కారణంగా ఈ చిత్రం ప్రముఖ ఓటిటి వేదికపై విడుదల కానుందంటూ రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఇక లాక్ డౌన్ కూడా తీసేయడంతో త్వరలోనే థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని భారీ సినిమాలు మాత్రం 100% ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరిచే వరకు ఎదురు చూస్తున్నాయి. కానీ చిన్న, మిడ్ లెవెల్ చిత్రాలు వరుసగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాయి. ఇక త్వరలోనే పెద్ద తెరపై సినిమాల జాతర జరగనుంది.
తాజావార్తలు
-
Story Board : పంజా విసురుతున్న ఎల్నినో.. ముంచుకొస్తున్న ఆహార సంక్షోభం..
-
USA: “నువ్వు ముస్లింవా?” అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
-
India U-19 vs Sri Lanka U-19: చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్లు.. రికార్డుల మోత
-
Tragedy: దమ్ముంటే హైదరాబాద్కు రమ్మన్నాడు.. నిజంగానే వచ్చి చంపేశారు.. ఏం జరిగిందంటే..
-
Iran: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? మరో సంక్షోభం రానుందా?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!