గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ‘రోలుగుంట సూరి’. నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలిపి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహిస్తున్నారు. తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై సౌమ్య చాందిని పల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా, ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ప్రముఖ నటుడు ‘నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ను విడుదల చేసిన అనంతరం రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇలాంటి సినిమాలు సైలెంట్గా వచ్చి పెద్ద సంచలనం సృష్టిస్తాయి. దర్శకుడు అనిల్ కుమార్ పల్లా హృదయాన్ని తాకే అద్భుతమైన సబ్జెక్ట్ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఫస్ట్ లుక్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సినిమా కూడా అదే స్థాయిలో అద్భుతంగా ఉండబోతోందనే నమ్మకం నాకు ఉంది. చిత్రయూనిట్కు నా అభినందనలు” అని అన్నారు.
దర్శకుడు అనిల్ కుమార్ పల్లా మాట్లాడుతూ – “మా సినిమా ఫస్ట్ లుక్ను ఆవిష్కరించిన రాజేంద్రప్రసాద్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన అభినందనలు మాకు మరింత నమ్మకాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయి. అదే ఉత్సాహంతో సినిమాను మరింతా అద్భుతంగా చిత్రించి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం,” అని తెలిపారు. నిర్మాత సౌమ్య చాందిని పల్లా మాట్లాడుతూ** – “‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ డ్రామా. భావోద్వేగాలతో, జీవిత సత్యాలతో మిళితమైన ఈ కథ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మా టీమ్లో ప్రతి ఒక్కరు తమ ప్రతిభను అద్భుతంగా కనబరుస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా అవుతుందనే నమ్మకం మాకు ఉంది,” అని అన్నారు.