Site icon NTV Telugu

సరికొత్త జోనర్ లో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీ

Prasanth Varma's PV4 title announcement Tomorrow

ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో తనదైన మార్క్ తో, సరికొత్త శైలిలో చిత్రాలను తెరకెక్కిస్తూ తెలుగు ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు ‘అ!’ అనే థ్రిల్లర్, ‘కల్కి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తో హిట్స్ అందుకున్నారు. ఆ తరువాత “జాంబీ రెడ్డి”తో తొలిసారిగా సౌత్ లో తెలుగు ప్రేక్షకుల ముందుకు జాంబీ జోనర్ ను తీసుకొచ్చి థ్రిల్ కలిగించారు. ఈ చిత్రం ఇటీవలే బుల్లితెరపై కూడా టిఆర్పీ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ఇక విషయానికొస్తే… ప్రశాంత్ తన నాలుగవ సినిమాను ప్రకటించడానికి సిద్ధమయ్యారు. రేపు మే 29న ప్రశాంత్ వర్మ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వెల్లడించనున్నారు. మే 29న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ సినిమా ప్రకటన ఉండబోతోందంటూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. అందులో హిమాలయాలు కంపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Exit mobile version