ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ సినిమా తమిళ లోనే కాదు తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రదీప్ రంగనాథన్ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఏజీఎస్ బ్యానర్ మీద అఘోరం, గణేష్, సురేష్ నిర్మించిన ఈ సినిమాను ఓరి దేవుడా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఫిబ్రవరి 21న రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ను రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ విడుదల చేస్తున్నారు. కోస్తాంధ్రలో పూర్వీ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్లో అన్ని రకాల అంశాలను జోడించారు. యూత్కి కావాల్సినంత వినోదం, ప్రేమ, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్నింటినీ జోడించారు. ఇంజనీరింగ్లో 48 బ్యాక్లాగ్లు పెట్టుకున్న హీరో.. కాలేజీలో పనీ పాటా లేనీ గాలికి తిరిగే ఓ కుర్రాడిగా కనిపించాడు.
Vijay Deverakonda: నిన్నంతా తారక్ తోనే ఉన్నా.. దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రేమ, బ్రేకప్, లైఫ్లో సెటిల్ అవ్వడం కోసం కష్టపడే తీరు ఇలా అన్నీ చూపించారు. ఫ్యామిలీ ఎమోషన్ను కూడా ట్రైలర్లో చూపించారు. బాధ్యతారాహిత్యంగా ఉండే కుర్రాడి జీవితంలో వచ్చే సమస్యలు, సవాళ్లు చూపిస్తూ.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఓ ఎంటర్టైనర్ మూవీ అవుతుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఈ చిత్రంలో కె. యస్. రవికుమార్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ వంటి స్టార్ డైరెక్టర్లు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో, టీజర్, పాటలు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ ట్రైలర్తో సినిమాపై మరింత బజ్ ఏర్పడింది. ఈ చిత్రంలో వి.జె. సిద్ధు, హర్షత్ ఖాన్, మరియం జార్జ్, ఇందుమతి మణికందన్, తేనప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది.