మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో ఫుల్ స్వింగ్లో జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్లో మరిన్ని కీలక మార్పులు చేసి గతంలో కంటే మరింత పవర్ఫుల్గా ఎలివేషన్లను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో తారక్ మునుపెన్నడూ చూడని విధంగా రెండు విభిన్న రూపాల్లో కనిపించబోతున్నారు. ఒకే సినిమాలో రెండు షేడ్స్ చూపించడం ప్రశాంత్ నీల్ స్పెషాలిటీ కాగా, ఎన్టీఆర్ మేకోవర్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పార్ట్-1లో ఎన్టీఆర్ చాలా షార్ప్గా, లీన్ లుక్లో కనిపించనున్నారు. పార్ట్-2 కోసం తారక్ ‘బీస్ట్ మోడ్’లోకి మారనున్నారు. భారీ కండలు పెంచి బల్క్ ట్రాన్స్ఫార్మేషన్ చూపించబోతున్నారు. ప్రశాంత్ నీల్ రెండు భాగాల షూటింగ్ను ఒకే సమయంలో సమాంతరంగా ప్లాన్ చేయడంతో నిరంతరం ఫిజిక్ మార్చుకోవడం తారక్ డెడికేషన్కు ఒక సవాలుగా మారింది. ఈ భారీ యాక్షన్ డ్రామా యొక్క తదుపరి షెడ్యూల్ మే 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ కొత్త షెడ్యూల్లో కథానాయికతో పాటు చిత్రంలోని ఇతర కీలక నటులు కూడా జాయిన్ కాబోతున్నారు. సినిమాలోని మేజర్ యాక్షన్ బ్లాక్స్ మరియు ఎమోషనల్ సీన్లను ఈ షెడ్యూల్లోనే చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ప్రశాంత్ నీల్ ఇచ్చే మాస్ ఎలివేషన్స్, ఎన్టీఆర్ నట విశ్వరూపం తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
