సమంత ‘మా ఇంటి బంగారంతో’ బిజీ, కాజల్, తమన్నా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ స్వింగ్ మెయింటైన్ చేస్తున్నారు. మరి నిత్యా మీనన్ సంగతి ఏంటి? ఆ మధ్య నిర్మాతగా మారుతున్నట్లు అనౌన్స్ చేసింది, కానీ ప్రాజెక్ట్ ఏంటో చెప్పలేదు. నటిగా తన నెక్స్ట్ మూవీ ఏంటో అప్డేట్ లేదు. నిత్య ఏం చేస్తున్నట్లు? అయితే నిత్య మీనన్, లాస్ట్ ఇయర్ ‘తలైవన్ తలైవి’, ‘ఇడ్లీ కడై’ డబ్బింగ్ సినిమాలతో హాయ్ చెప్పిన ఈ బాలీవుడ్ కుట్టి, ఆ తర్వాత కొత్త సినిమా కబురు వినిపించలేదు. ఆ మధ్య ‘కేయూరి ప్రొడక్షన్స్’ అనే సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా మారుతున్నట్లు అనౌన్స్ చేసింది, కానీ ఏ ప్రాజెక్ట్ పట్టాలెక్కించిన దాఖలాలు లేవు. నటిగానూ ఏ సినిమా చేస్తుందో అప్డేట్ లేదు.
నటిగా జాతీయ స్థాయిలో గుర్తింపు రావడంతో న్యూ స్టెప్ తీసుకోబోతుంది నిత్య. 24 క్రాఫ్ట్స్ లోని కీలక విభాగమైన దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతుందట. ఈ విషయాన్ని ‘తలైవన్ తలైవి’ డైరెక్టర్ పాండిరాజ్ రివీల్ చేశాడు. నిత్య గుడ్ రైటర్ అంటూ పొగిడేసిన డైరెక్టర్, ఆల్రెడీ రెండు స్క్రిప్ట్స్ కంప్లీట్ చేసిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆమెకు డైరెక్టర్ కావాలని కోరిక ఉందని తనతో చెప్పినట్లు పేర్కొన్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చింది నిత్యా మీనన్.
తెలుగులో సరైన స్క్రిప్ట్ రాకపోవడం వల్ల గ్యాప్ తీసుకున్న నిత్యా మీనన్, తమిళంలో ఓ కథకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్న నిత్య, ప్రాఫిట్ షేర్ విధానంలో పేమెంట్ తీసుకుంటుందన్న టాక్ నడుస్తోంది. నిత్య నెక్స్ట్ నటిగా కనిపిస్తుందో, నిర్మాతగా మారబోతుందో, దర్శకురాలి అవతారం ఎత్తబోతుందో చూడాలి.

