Site icon NTV Telugu

“తిమ్మరుసు” ప్రీరిలీజ్ ఈవెంట్ లో నాని… ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఎవరికంటే?

Nani’s emotional speech about the Tollywood Industry

మంగళవారం సాయంత్రం జరిగిన “తిమ్మరసు” ప్రీ-రిలీజ్ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాని చేసిన ఉద్వేగభరితమైన స్పీచ్ ఇస్తూ సినీ పరిశ్రమను కాపాడాలని ప్రభుత్వాలను కోరారు. “కరోనా కారణంగా చిత్ర పరిశ్రమ ఎక్కువగా ప్రభావితమవుతుంది. మహమ్మారి కారణంగా మొదట థియేటర్లు మూసివేయడం, తిరిగి ఓపెన్ చేయడం జరుగుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ కొన్నేళ్లుగా భారీగా పెరిగాయి. కానీ టికెట్ ధర విషయంలో మాత్రం ఆంక్షలు ఉన్నాయి. ఇది కేవలం హీరోలు మరియు నిర్మాతల గురించి మాత్రమే కాదు. లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చిత్ర పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. భారతీయులకు థియేటర్లలో సినిమాలు చూడటం అనే ప్రధాన ఎంటెర్టైన్మెంట్ లలో ఒకటి. థియేటర్లలో సినిమాలు చూడటం తెలుగు ప్రేక్షకుల జన్మ హక్కు. మేము మా ఇళ్ల తర్వాత సినిమా హాళ్ళలో ఎక్కువ సమయం గడుపుతాము. మేము కూడా మా కుటుంబాలు, స్నేహితులతో థియేటర్లలో సినిమాలు చూస్తాము. థియేటర్లలో సినిమాలు చూడటం సురక్షితం. ఎందుకంటే మీరు బార్‌లు, పబ్బులు, రెస్టారెంట్లలో మాస్కులు తీసేయాల్సి వస్తుంది. కానీ మీ ఫేస్‌ మాస్క్‌లను తొలగించకుండా సినిమాను చూడవచ్చు. సెకండ్ వేవ్ తరువాత టాలీవుడ్ లో థియేటర్లు “తిమ్మరుసు”తో తిరిగి తెరుచుకుంటున్నాయి. మూడవ వేవ్ ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. తెలుగు సినిమా త్వరగా ట్రాక్‌లోకి తిరిగి రావాలి” అని నాని కోరుకున్నారు.

Read Also : “ఎస్ఆర్ కల్యాణమండపం” ట్రైలర్… ఫన్ తో పాటు ఎమోషన్స్ కూడా…!

అయితే నాని స్పీచ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టికెట్ ధరల స్లాబ్ పరిమితులకు పరోక్ష కౌంటర్ ఇచ్చినట్టుగా అన్పిస్తోంది. “పెట్రోల్ డీజిల్, వంట నూనె, ఇతర వస్తువుల ధరలు కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంటున్న సమయంలో, సినిమా హాళ్ళలో టికెట్ ధరలపై దృష్టి పెట్టడం సరైనది కాదు. ప్రభుత్వాలు, మనమందరం సమిష్టిగా త్వరలో సమస్యను పరిష్కరించగలమని నేను ఆశిస్తున్నాను” అని ఆయన అన్నారు. సినిమా హాళ్ళలో టికెట్ ధరలను తగ్గించే కొత్త ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జి.ఓను రద్దు చేసి, సినిమా హాళ్ళలో సౌకర్యవంతమైన టికెట్ ధరలను అనుమతించాలని టాలీవుడ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తోంది.

Exit mobile version