Site icon NTV Telugu

Naga Chaitanya : ఆ మూవీ నాకు చాలా ప్రత్యకమైనది.. నాగచైతన్య

Thandel: లవ్ స్టోరీ మూవీ తరువాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా భారీ విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.అంతే కాకుండా చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ గా తండేల్ తెరకెక్కుతుంది ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో చైతన్య బెస్తవాడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందు మొండేటి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

Also Read; Family Star Trailer : ‘ఫ్యామిలీ స్టార్ ‘ ట్రైలర్ వచ్చేసింది.. ఆ ఒక్కటి హైలెట్ బాసూ..

“తాండల్” నేను చాలా కాలంగా పని చేస్తున్నాను మరియు ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. నేను ఈ రకమైన పాత్రని ప్రయత్నించడం ఇదే మొదటిసారి. 2018లో శ్రీకాకుళం మత్స్యకారులతో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సాధారణంగా గుజరాత్ వెళ్లి అక్కడి నుంచి పడవలు తీసుకుని చేపల వేటకు వెళ్తుంటారు. వారి ఒక పర్యటనలో, వారు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి కూరుకుపోయి పట్టుబడ్డారు. ఏడాదిన్నర పాటు జైలు జీవితం గడిపిన వారి ప్రయాణం, చివరికి ఎలా బయటకు వస్తారనేదే ఈ చిత్రం సారంశం అని నాగచైతన్య చెప్పుకొచ్చారు.ఇక ఈ సినిమా కి సంగీత దర్శకుడిగా రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పనిచేస్తున్నాడు.

Exit mobile version