పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్ లో 28వ చిత్రాన్ని దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వింటేజ్ బైక్పై బ్లాక్ షర్ట్ ధరించి, చేతిలో ఓ సూట్కేసు పట్టుకొని స్టైలీష్గా కూర్చొని ఉన్నాడు. ఈ పోస్టర్ పై మైత్రీ మూవీ మేకర్స్ లోగో కూడా ఉండటంతో చాలా వరకు అభిమానులు నమ్మేశారు. దీంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ప్రచారం బాగా ముదరడంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. ఏ విషయం అయినా తమ అధికారిక ఖాతాల ద్వారా వెల్లడించే వరకు నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. అయితే తాజాగా ఈ పోస్టర్ పై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ‘యంగ్ టాలెంట్ కి.. ఇంటర్నెట్ మరొక ఇల్లు లాంటిదని పేర్కొన్నాడు. వారి ప్రతిభను ఉద్దేశిస్తూ.. ‘వావ్’ అంటూ నాగబాబు పోస్టర్ షేర్ చేశారు.
పవన్ ‘ఫ్యాన్ మేడ్ పోస్టర్’ కు నాగబాబు ఫిదా
