Chiranjeevi: నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు.. పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ!

  • మెగాస్టార్ చిరంజీవి: ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులతో ఎలాంటి భేటీ జరగలేదని స్పష్టీకరణ
  • 30% వేతన పెంపు డిమాండ్లను అంగీకరించినట్లు తప్పుడు ప్రచారాన్ని ఖండించిన చిరంజీవి
  • ఫిల్మ్ ఛాంబర్ సమిష్టి చర్చల ద్వారానే పరిశ్రమ సమస్యలకు పరిష్కారం: చిరంజీవి
Chiranjeevi

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవితో ఫెడరేషన్ సభ్యులు భేటీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయం మీద మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించాలి. నా దృష్టికి వచ్చిన విషయం ఏమిటంటే — ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు మీడియాలోకి వెళ్లి, నేను వారిని కలసి, 30% వేతన పెంపు వంటి వారి డిమాండ్లను అంగీకరించానని తప్పుడు ప్రకటనలు చేశారు. ఈ సందర్భంలో నిజం ఏంటో స్పష్టంగా చెప్పదలచుకున్నాను.

Also Read:Srinu Vaitla : ‘ఢీ’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీనువైట్ల..

×
×
Ad

నేను ఫెడరేషన్‌కి చెందిన ఎవరినీ కలవలేదు. ఇది పరిశ్రమ మొత్తానికి సంబంధించిన విషయం. ఏ వ్యక్తిగతంగా అయినా, నేను సహా, ఏకపక్షంగా ఇలాంటి సమస్యలకు హామీ ఇవ్వడం లేదా పరిష్కారం చూపడం సాధ్యం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిల్మ్ ఛాంబర్‌నే అగ్ర సంస్థ. అన్ని వర్గాలతో చర్చలు జరిపి న్యాయసమ్మతమైన పరిష్కారానికి రావడం ఫిల్మ్ ఛాంబర్‌ సమిష్టి బాధ్యత. అంతవరకు, అన్ని పక్షాల్లో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో చేసిన ఇలాంటి నిరాధారమైన మరియు ప్రేరేపిత ప్రకటనలను నేను ఖండిస్తున్నాను. దయచేసి గమనించండి అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.