ఈ ఏడాది దసరా పండుగ సీజన్ను సొంతం చేసుకునేందుకు బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్స్టార్ రజినీకాంత్ ఇద్దరూ దసరా బరిలోనే తమ సినిమాలను నిలిపేందుకు సిద్ధమయ్యారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా పండుగ సెలవుల సమయంలో థియేటర్లకు వస్తే వసూళ్లు అద్భుతంగా ఉంటాయనే వ్యూహంతో స్టార్ హీరోలు ఈ సీజన్పై కర్చీఫ్ వేశారు.
సూపర్స్టార్ రజినీకాంత్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర‘ ను అక్టోబర్ 16న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ ‘విశ్వంభర’ అధికారిక రిలీజ్ డేట్ను ప్రకటించనున్నారు. అయితే దసరా రేసులో ఉండాల్సిన పలు పెద్ద సినిమాలు మాత్రం మిడిల్ డ్రాప్ అయ్యాయి. ప్రభాస్ హెవీ పీరియాడిక్ డ్రామా ‘ఫౌజీ‘ డిసెంబర్ 3వ తేదీకి షిఫ్ట్ అవ్వగా అక్కినేని నాగార్జున మైలురాయి చిత్రం ‘నాగ్ 100‘ ఈ దసరాకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరు స్టార్స్ దసరా బరి నుండి తప్పుకున్నట్లయింది.
మిగతా స్టార్స్ దసరా వారంపై దృష్టి పెట్టగా విక్టరీ వెంకటేష్ మాత్రం ఎటువంటి పోటీ లేకుండా ముందుగానే థియేటర్లలోకి రాబోతున్నారు. వెంకీ నటిస్తున్న ‘ఆదర్శకుటుంబం‘ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సోలోగా విడుదల కానుంది. మొత్తంమీద ఈ పండుగ సీజన్ ప్రేక్షకులకు, బాక్సాఫీస్కు పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.

