Site icon NTV Telugu

కియారా హింట్ ఇచ్చిన.. ఆ క్లారిటీ లేదు!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘భరత్ అనే నేను’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆతర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించింది. అప్పటినుంచి ఈ బ్యూటీ తెలుగుల్లో నటించలేదు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియా అభిమానులతో ముచ్చటించింది. కాగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఎప్పుడు ఉంటుందని ఓ తెలుగు అభిమాని ప్రశ్నించాడు. ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతం తెలుగులో సినిమా కోసం రెడీ అవుతున్నట్లుగా తెలిపింది. ఈ విషయమై త్వరలోనే నప్రకటన ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే కియారా ఏ సినిమాలో నటిస్తుందనే దానికి మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఆమె కొరటాల శివ-ఎన్టీఆర్, రామ్ చరణ్-శంకర్, మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాల్లోని ఏ కాంబినేషన్ లో నటించనుందనే దానికి త్వరలోనే క్లారిటీ రానుంది.

Exit mobile version