సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ ట్విటర్ ఖాతా మరోసారి హ్యాకింగ్కు గురైంది. ఇదే విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. గత ఏడాది ఏప్రిల్లోనూ ఇలానే జరగగా, అభిమానుల సాయం కోరింది. అయితే ప్రస్తుత హ్యాకింగ్ ఈ విషయంలో ట్విటర్ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి సహాయం లేదని తెలిపింది. అసలేం జరుగుతుందో తెలియడం లేదు. చూస్తుంటే నా ఖాతాని సస్పెండ్ చేసినట్లు ట్విటర్ పేర్కొంది. ఈ సమస్యను ఎవరైనా పరిష్కరిస్తే.. వారికి ముందుగా ధన్యవాదాలు అని పోస్టు చేశారు. ట్విటర్లోని కవర్ ఇమేజ్తో పాటు ఖుష్బూ సుందర్గా ఉన్న ఆమె ఖాతా పేరును కాస్త ‘బ్రియాన్’గా హ్యాకర్లు మార్చేశారన్నారు. గతంలో ఆమె చేసిన ట్వీట్లు, పోస్టులను డిలీట్ చేశారన్నారు.