దేవర సినిమా టికెట్ ధరలపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే, సెప్టెంబరు 27న విడుదల కానున్న దేవరకు 14 రోజులు పాటు అధిక టికెట్ ధరకు టికెట్స్ అమ్ముకునెలా జీవో ఇచ్చింది. అయితే టికెట్ ధరలను 14 రోజులు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ పిల్, విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దేవర సినిమా టికెట్ ధరలపై నిర్మాతలకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. టికెట్ ధరలను పెంచటాన్ని 10 రోజులకు మాత్రమే పరిమితం చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
Also Read : Devara : ఏపీ / తెలంగాణ దేవర అడ్వాన్స్ సేల్స్ వివరాలు..
కాగా దేవరకు 14 రోజులు టికెట్ ధరలను పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మెమో సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ చేసిన న్యాయస్థానం, హై బడ్జెట్ సినిమాల టికెట్ ధరలను పెంచటానికి 10 రోజులు మాత్రమే అనుమతి ఇవ్వాలని కమిటీ రిపోర్ట్ ఉందని చెప్పిన పిటిషనర్ వాదనలు వినిపించాడు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం దేవరకు మొదటి 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచేందుకు అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు,