Renukaswamy Murder Case: హత్యకు ముందు పీకల దాకా ఆహారం.. రేణుకా స్వామి పోస్టుమార్టం రిపోర్టులో సంచలన అంశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crucial Element in Renukaswamy Murder Case Post Mortem Report: చిత్ర దుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణ హత్యకు గురయ్యారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలను పంపినందుకు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి తీసుకొచ్చి బెంగళూరులోని పట్టనగెరెలోని ఓ షెడ్డులో దారుణంగా దర్శన్ అండ్ కో హత్య చేశారు. ఈ హత్య కేసులో దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి అయితే, కన్నడ నటుడు దర్శన్ రెండో ముద్దాయి. రేణుకాస్వామి హత్య కేసులో మొత్తం 17 మంది నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దర్శన్, పవిత్రగౌడ సహా 13 మంది నిందితులు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. మిగిలిన నలుగురు నిందితులను భద్రతా కారణాల దృష్ట్యా తుమకూరు జైలుకు తరలించారు. అయితే రేణుకాస్వామి హత్య ఎలా జరిగింది? హత్యకు ముందు పట్టంగారే షెడ్లో ఏం జరిగిందనేది పోలీసుల విచారణలో తేలింది. ఇప్పుడు ఓ షాకింగ్ విషయం బయటపడింది. హత్యకు ముందు రేణుక స్వామికి హంతకులు భారీగా ఆహారం తినిపించినట్లు తెలుస్తోంది.
Malvi Malhotra: రాజ్ తరుణ్ తో నా రిలేషన్ ఇదే.. ఎన్టీవీతో మాల్వి బయట పెట్టిన నిజం ఇదే!
Also Read
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
- Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
- King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
రేణుకా స్వామికి బోలెడంత తినిపించి హంతకులు అతడిని చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. హత్యకు గురైన రేణుకాస్వామి కడుపులో జీర్ణం కాని ఆహారం ఉందని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. సాయంత్రం 4.30 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఆహారం తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆహారం తిన్న తర్వాత హత్య జరిగినట్లు తెలిసింది. రేణుకాస్వామి హత్య కేసులో నిందితులపై పోలీసులు బలమైన ఆధారాలు సేకరిస్తున్నారు. పోలీసులు త్వరలోనే చార్జిషీట్ను సమర్పించనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో పవిత్ర గౌడ మొదటి నిందితుడు. నటుడు దర్శన్ A2, పవన్ అలియాస్ A3 నిందితుడు, రాఘవేంద్ర నాలుగో నిందితుడు, నందీష్ A5, జగదీష్ అలియాస్ జగ్గా A6, అను A7, రవి A8, రాజు A9, వినయ్ A10, నాగరాజ్ A11, లక్ష్మణ్ A12, దీపక్ A13, ప్రదోష్ A14, కార్తీక్ A15, కేశవ్ మూర్తి .ఏ16గా, నిఖిల్ నాయక్పై ఏ17గా కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Komaram Bheem District : ఆసిఫాబాద్లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..