న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా ‘బా బా బ్లాక్ షీప్’ అనే చిత్రం రాబోతోంది. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో ఈ సినిమా సాగనుందని అంటున్నారు. దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు, కార్తికేయ, విస్మయ శ్రీ, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read:Nani 34: నాని-సుజిత్ బ్యానర్ మారి, మొదలైంది!
దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కథ, కాన్సెప్ట్ను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ను రిలీజ్ చేయించారు. ఓ ముగ్గురు చుట్టూ తిరిగే కథ అంతా కూడా ఒకే రోజులో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి పుట్టే కామెడీ, ఈ జర్నీలో జరిగే క్రైమ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్కి కొత్త అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. మిగతా వివరాలు మేకర్లు త్వరలో ప్రకటించనున్నారు.
