టాలీవుడ్లో రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించగా, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో కూడా మెరిశారు. తాజాగా విశాఖపట్నంలో వైభవంగా జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 వేదికపై ‘అనకాపల్లి’ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. టాలీవుడ్ థండర్స్ టీమ్తో పాటు హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు మరియు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ తదితరులు వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్ను ఆవిష్కరించి చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.
విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథ ఎంతో ఫ్రెష్గా ఉండటంతో పాటు, తారక్ పొన్నప్ప పవర్ఫుల్ విలనిజం సినిమాకి ప్రధాన హైలైట్గా నిలవనుంది. ఎంతో నేచురల్గా కట్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ తల్లిదండ్రులుగా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ నటిస్తున్న తీరు చూస్తుంటే కుటుంబ ప్రేక్షకులకు కావాల్సినంత భావోద్వేగం ఈ చిత్రంలో ఉందని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్కు నచ్చే అన్ని హంగులతో ఈ ట్రైలర్ను రూపొందించారు.

