Site icon NTV Telugu

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత

Actress Namitha Visits Tirumala Tirupathi

తమిళ హీరోయిన్ నమిత తాజాగా తిరుమలలో దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతంరం ఆమె మీడియాతో మాటాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం తాను నటిస్తున్న “భౌభౌ” సినిమా షూటింగ్ పూర్తయ్యిందని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఆ సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలా ? లేకపోతే ఓటిటిలో రిలీజ్ చేయాలా అనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా నమిత ఓటిటి యాప్ ను, నమిత ప్రొడక్షన్ వర్క్స్ ను త్వరలోనే ప్రారంభిస్తున్నాను అని ప్రకటించారు. అంటే ఇప్పటి వరకూ నటిగా మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు నిర్మాతగానూ సినిమాలను నిర్మించి అలరించబోతోందన్న మాట.

Read Also : రివ్యూ : స్టేట్ ఆఫ్ సీజ్ : టెంపుల్ అటాక్ (జీ 5)

ఇక “జెమినీ” చిత్రంతో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నమిత. ఆ తరువాత పలు చిత్రాలతో అలరించిన ఈ భామ తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ మిస్ సూరత్ 2017లో తన బాయ్ ఫ్రెండ్ వీరేంద్రను తిరుపతిలోనే వివాహం చేసుకుంది. నమిత పెళ్లి తరువాత కూడా సినిమాల్లో నటిస్తోంది.

Exit mobile version