Site icon NTV Telugu

బిగ్ బాస్-5 ఇద్దరి సభ్యులకు కరోనా పాజిటివ్!

కరోనా కేసులు ప్రస్తుతం తగ్గుముఖం పట్టిన అజాగ్రత్తగా వుండే మాత్రం ఇక అంతే సంగతిని కరోనా పరిశోధన సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. రానున్న రెండు నెలలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెపుతున్నాయి. కాగా, ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే సినీ అభిమానులకు పాత రోజులు వచ్చినట్లుగానే థియేటర్లు, సరికొత్త టీవీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ ప్రోగ్రాంతో అలరిస్తుండగా, సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్-5 షో కూడా ప్రారంభం కానుంది. అయితే గత ఏడాది మరిదిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ లో ఇద్దరికీ కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈసారి చాలా కొత్తగా బిగ్ బాస్-5 షో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారట.

Exit mobile version