అల్లు రామలింగయ్య భార్య, శ్రీమతి అల్లు కనకరత్నం వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ నిన్న తెల్లవారుజాము కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బ్రతికి ఉన్న సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి చేపట్టిన బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ వంటి కార్యక్రమాలకు ప్రభావితులయ్యారు. మనిషి పోయాక కాలి బూడిద అయిపోయే వాటిని ఇతరులకు దానం చేయడం మంచి విషయం. తాను మరణించిన తర్వాత తన కళ్ళను దానం చేయాలని అప్పట్లో ఆమె మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె మరణించిన తర్వాత ఆమె కళ్ళను దానం చేయాలనీ భావించి అల్లు అరవింద్ ని అడిగాను అందుకు ఆయన అంగీకరించారు. ఆమె కళ్ళను అల్లు కుటుంబం దానం చేసింది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలియజేశారు. ఆమె నేతృధానం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఈ సందర్భంగా మెగాస్టార్ పేర్కొన్నారు.
MegaStar : అల్లు కనకరత్నం గారి నేత్రదానం ఎందరికో స్ఫూర్తి దాయకం

Chiru